జనసైనికుడి కుటుంబాన్ని పరామర్శించిన జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం మండలం, పి.రాయవరం గ్రామానికి చెందిన గుండ్ర సోమరాజు మరణించారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు సోమవారం స్వర్గీయ గుండ్ర సోమరాజు స్వగృహానికి పి రాయవరం గ్రామ జనసైనికులతో కలిసి వెళ్ళి సోమరాజు కుమారులు గుండ్ర ప్రసాద్, గుండ్ర నాగు లను కలిసి ప్రగాఢసానుభూతిని తెలియజేసి, వారి కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పి రాయవరం కురాకుల వాసు, మాదిపల్లి దుర్గాప్రసాద్, కందా అరవిందు, పిన్నం మహేష్, యండపల్లి వీరబాబు, కోత్తెం వీరబాబు, పినపాత్రుని అజేయ్, బెజవాడ దుర్గాప్రసాద్, కురాకుల శంకర్, దేశిలంక శేఖర్, అయినాల సురేష్, ఇతర జనసైనికులు, తదితరులు ఉన్నారు.