జనసేన వారాహి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించిన కదిరి శ్రీకాంత్ రెడ్డి

తాడిపత్రి: జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళవారం రోజున కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో జనసేన ప్రచార రథం వారాహి వాహనానికి పూజలు నిర్వహించిన సందర్భంగా తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి తాడిపత్రి పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో మరియు స్ధానిక సయ్యద్ సిద్ది బాషా స్వామీ వారి దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో వైసీపీ పార్టీ ఓటమే లక్ష్యంగా, ప్రజల శ్రేయస్సు కొరకు అవినీతి లేని ప్రజా పరిపాలన కోసం ఏర్పాటు చేసిన ప్రచార రథం వారాహి వాహనానికి మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఇబ్బందులూ రాకుండా వుండాలని ప్రార్థించారు. ఈ పూజా కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ నాయకులు హర్షద్అయుబ్, రసూల్, రమణ, మణికంఠ, హరి, రాహూల్, షేక్షా, హజి, శ్రీను తదితులు పాల్గొన్నారు.