పెంచిన విద్యుత్ చార్జీలపై గళమెత్తిన కైకలూరు జనసేన

కృష్ణా జిల్లా, కైకలూరు నియోజకవర్గం, పెంచిన విద్యుత్ చార్జీలపై గళమెత్తిన జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు. కైకలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు స్థానిక జనసేన పార్టీ జిల్లా కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి మచిలీపట్నం కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసి నిరసన తెలియజేసి, కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన జనసైనికులు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బట్టు లీలా కనదుర్గ, కృష్ణా జిల్లా కార్యదర్శి బివి రావు, జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పురి నానాజీ, ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వేంకటేశ్వర రావు, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు చక్రపాణి, జనసేన నాయకులు అంబుల భరత్, సూరి నారాయణ, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.