కళ్యాణదుర్గం నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం

కళ్యాణదుర్గం నియోజకవర్గ కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామంలో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ పాల్గొనదం జరిగింది. ఈ సందర్బంగా టి.సి.వరుణ్ మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పార్టీ బలోపేతం దిశగా కార్యకర్తలకు నాయకులకు దిశా నిర్ధేశం చెయ్యడం జరిగింది. అదేవిధంగా మండల గ్రామస్థాయి పరిధిలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండకట్టాలి అని పిలుపునివ్వడం జరిగింది. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా మరిన్ని కార్యక్రమాలు చేయాలని ప్రజా సమస్యలు గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని జనసేన నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే వెంటనే మా దృష్టికి తీసుకొని వస్తే ఆ సమస్య కోసం ఎంతకైనా పోరాడుదామని కార్యకర్తలకు ధైర్యం భరోసా ఇచ్చారు. అలాగే జనసేన పార్టీ విధి విధానాలు నచ్చి పలువురు యువత జాయినింగ్ అవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యక్రమాల కమిటీ ప్రధాన కార్యదర్శి భవాని రవి కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు జయరామి రెడ్డి, అంకె ఈశ్వరయ్య, అనంతపురం నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, కార్యదర్శి సంజీవరాయుడు, సహాయక కార్యదర్శులు అవుకు విజయ్, ముప్పూరి కృష్ణ, రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, కంబదూరు మండల అధ్యక్షులు చంద్రమౌళి, కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ, బ్రహ్మసముద్రం మండల అధ్యక్షులు ఆంజనేయులు, శింగనమల మండల అధ్యక్షులు తోట ఓబులేష్, నార్పల మండల అధ్యక్షులు రామకృష్ణ, కంబదూరు జనసేన నాయకులు రాంప్రసాద్ వెంకటేష్, కార్తీక్ సురేష్ మొదలైన జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. జనసేన వీరమహిళలు షేక్ తార, శ్రావణి, మమత, కళ్యాణదుర్గం జనసేన నాయకులు జాకీర్ వంశీకృష్ణ, శ్రీహర్ష, రాయుడు, సెట్టూరు జనసేన నాయకులు షేక్ రజాక్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.