జిల్లా అధ్యక్షులు శ్రీ TC వరుణ్ ని కలిసిన కళ్యాణదుర్గం మండలాధ్యక్షులు

జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ TC వరుణ్ ని కలిసి నూతన సంవత్సర కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లక్ష్మి నరసయ్య మరియు జిల్లా సంయుక్త కార్యదర్శి రాజేష్ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి కొత్తగా ఎన్నికైన 5 మండలాల అధ్యక్షులు, కళ్యాణదుర్గం మండల అధ్యక్షులు మొహిద్దీన్, శెట్టురు మండల అధ్యక్షులు లేపాక్షి ఈరన్న, బ్రహ్మసముద్రం మండల అధ్యక్షులు ఆంజనేయులు, కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ, కంబదూర్ మండల అధ్యక్షులు చంద్రమౌళి మరియు జనసేన నాయకులు, శ్రీనివాసులు, నరసింహ, గంగరాజు, అనిల్, మహేష్, పవన్ యాదవ్, మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగింది. క్రియాశశీలక సభ్యత్వాల గురించి మరియు అనారోగ్య సమస్యలతో మరణించిన జనసైనికులను ఆదుకోవాలని లేఖ ఇవ్వడం జరిగింది.