కనిగిరి నియోజకవర్గ జనసేన-తెలుగుదేశం-బీజీపీ ఆత్మీయ సమావేశం

కనిగిరి నియోజకవర్గ ఎన్.డి.ఏ ఆత్మీయ సమావేశం మరియు ప్రెస్ మీట్ బుధవారం అమరావతి గ్రౌండ్స్ కనిగిరి నందు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఎన్.డి.ఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్.ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, జనసేన పార్టీ కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి నాగరాజు, ప్రకాశం జిల్లా ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి రామిశెట్టి సునీల్ కుమార్, పామూరు మండల అధ్యక్షులు దరిశి ఏడుకొండలు, పీసీపల్లి మండల అధ్యక్షులు బండార్ రాజు, కోటంశెట్టి మధు, శానం ఆంజనేయులు, నున్న శ్రీనివాసులు, ఉల్లిపాయల సుబ్బారాయుడు, గోస్ట్ సునీల్, కంచర్ల వంశి, చరణ్, సాయి, అక్బర్, మరియు జనసేన-తెలుగుదేశం-బీజీపీ కనిగిరి నియోజకవర్గ కార్యకర్తలు జన సైనికులు, వీర మహిళలు, పాల్గొన్నారు.