ప్రమాదంలో గాయపడిన భాషా కుటుంబాన్ని పరామర్శించిన కాంతిశ్రీ

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, తాళ్లవలస పంచాయతీకి చెందిన జనసేన పార్టీ కుటుంబ సభ్యులు లింగాల కిషోర్ తండ్రి లింగాల భాషా ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు శ్రీమతి కాంతిశ్రీ భాషా కుటుంబాన్ని పరామర్శించి.. కొంత ఆర్థిక సహాయం చేసి.. ఆ కుటుంబానికి ఎప్పుడు జనసేన పార్టీ అండగా ఉంటుందని ధైర్యాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గారావు, సూర్య, సత్య, నాయుడు, లక్ష్మణ, గ్రామ జనసైనికులు శంకర్, పవన్, చిరు, సూర్య వెంకటేష్ పాల్గొన్నారు.