బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని ఆర్.డి.ఓ కి వినతి పత్రం అందించిన గర్భాన!

పాలకొండ నియోజకవర్గం, పాలకొండ మండలం పొట్లి, నవగాం మధ్య గల వంతెన శిథిలా వ్యవస్థలో వున్న నేపథ్యంలో.. వంతెనను పరిశీలించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా గర్భాన సత్తిబాబు.. బ్రిడ్జి పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం స్పందించి నిధులు కేటాయించి నిర్మాణ పనులు చేపట్టాలని సంబంధిత పాలకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్.డి.ఓ) కి వినతి పత్రం అందజేయడం జరిగింది. వెంటనే రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్.డి.ఓ) సానుకూలంగా స్పందించి, వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు.