జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అడబాల తాత కాపు

రాజోలు నియోజకవర్గం: మామిడికుదురు మండలం, లూటుకుర్రు గ్రామంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రామంలో పంచాయతీ వద్ద అంగనవాడి కేంద్రాల వద్ద అమరవీరుల స్తూపం వద్ద పిహెచ్సి మండల ప్రజా పరిషత్ స్కూల్ వద్ద మామిడి కుదురు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు గ్రామ సర్పంచ్ అడబాల తాత కాపు జాతీయ జెండా ఆవిష్కరణను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వనజ కుమారి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు ఎంపీటీసీ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.