గ్రామ స్థాయి జనసేన విస్తృత ప్రచారంలో కరిమజ్జి మల్లీశ్వారావు

*పవనన్న ప్రజాబాట 58వరోజు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం పవనన్న ప్రజాబాట ప్రచార కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నాయకులు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వారావు, జనసేన పార్టీ యంపీటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు బంటుపల్లి గ్రామ చెరువులో శనివారం ఉదయం బంటుపల్లి గ్రామ చెరువులో పర్యటించి.. చెరువులో ఉన్న ఉపాధి కూలీలు ప్రతి ఒక్కరినీ కలవడం జరిగింది.

జనసేన పార్టీ మేనిఫెస్టో గురించి ప్రతి మహిళకు,యువతకు,పెద్దలకు, తెలియజేస్తూ.. పవనన్న ప్రజాబాట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి 58 రోజులు పూర్తి చేసుకున్న పవనన్న ప్రజాబాట సుదీర్ఘంగా ప్రజలు దగ్గరకు వెళ్ళి పలు కుటుంబాలను పలకరిస్తూ ముందుకు సాగడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో కరిమజ్జి మల్లీశ్వారావు మాట్లాడుతూ.. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్రలో బాగంగా 3000 మంది చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలను నేరుగా పరామర్శించి.. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు విరాళం అందిస్తున్న.. గొప్ప మనసున్న నాయకుడని.. అలాంటి నాయకుడిని కాపాడు కోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలియజేశారు. అలాగే వివిధ విషయాలు గురించి వివరించి వాళ్లకు అవగాహన కల్పించారు. కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. అలాగే వృద్దులతో మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. జనసేన ప్రభుత్వం వస్తే సంవత్సరానికి 5గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పేదలకు ఇవ్వబడుతుందని.. ప్రతి పేద ప్రజలకు ఇల్లు కట్టుకోవడానికి తెల్లరేషన్ కార్డు కలిగినవారికి ఇసుక ఉచితంగా ఇవ్వబడుతుందని.. అలాగే తెల్లరేషన్ కార్డుదారులకు రేషన్ బదులు 2500/-నుండి3500/-వరకు ఎకౌంటులో నగదు జమ చేయబడుతుందని తెలియజేశారు. తాము ప్రారంభించిన పవనన్న ప్రజాబాటకు ప్రజలనుండి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇద్దాం అని ఓటేసిన వారెవరూ ఈసారి వైసిపి కి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు. ఈ కార్యక్రమంలో బంటుపిల్లి గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.