బోడ్డపాడు గ్రామ ఉపాధి కూలీలతో కరిమజ్జి మల్లీశ్వారావు భేటీ

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం బోడ్డపాడు గ్రామంలో శనివారం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేనపార్టీ నాయకులు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వారావు గారు మరియు జనసేన పార్టీ ఎంపిటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు బోడ్డపాడు గ్రామ ఉపాధి కూలీలతో మాట్లాడుతూ జనసేనపార్టీ సిద్దాంతాలు మరియు మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ప్రతి ఇంటింటికి ప్రతి మహిళకు పెద్దలుకు పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా 3000మంది కౌలు రైతులు చెనిపోయారని, వాళ్ళు కుటుంబాలను నేరుగా పరామర్శించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. ఇలాంటి నాయకుడిని కాపాడు కోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. శనివారం ఉదయం బోడ్డపాడు గ్రామంలో ఇంటింటికి కార్యక్రమంలో మరియు ఉపాధి కూలీలతో మాట్లాడుతూ ఇలాంటి సేవాకార్యక్రమాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని కోరారు. పవనన్న ప్రజాబాట 69 రోజులు సుదీర్ఘంగా ప్రజలు దగ్గరకు వెళ్ళి ప్రతి విషయాన్ని వివరించడం, ప్రజలనుండి అపూర్వమైన లభిస్తుందన్నారు. ఈసారి జనసేనపార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో బోడ్డపాడు గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు.