డా.బాబు జగ్జీవన్ రామ్ కి నివాళులు అర్పించిన నూజివీడు జనసేన

నూజివీడు, మారు మూల ప్రాంతం నుండి దేశ నాయకుడిగా వెలిగిన మహనీయుడు, స్వతంత్ర సమరయోధుడు, దివంగత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కి నివాళులు అర్పించిన నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు. నూజివీడు నియోజకవర్గ ముసునూరు మండలం రమణక్కపేట గ్రామ పరిధిలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు స్థానిక యువతతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ కుల నిర్మూలన కోసం ఆయన చేసిన కృషి, రాజకీయ ప్రస్థానం గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాశం నాగబాబు, గ్రామ బాబు జగ్జీవన్ రామ్ కమిటీ సభ్యులు అముదాల సర్వేశ్వరరావు, ఆముదాల నోబుల్, ఆముదాల దేవదానం, ఆముదాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.