బంద్ కు కేసీఆర్ మద్దతు

భారత్ బంద్‌కు టీఆర్ఎస్ మద్దతుపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఈనెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు సంఘీభావంగా ఈ నెల 8వ తేదీన దేశ వ్యాప్త బంద్ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీనికి తమ మద్దతు ఉంటుందని, టీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యక్షంగా బంద్ లో పాల్గొంటారని కేసీఆర్ తెలిపారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా వ్యవసాయ చట్టాలున్నాయని, అందుకే తాము పార్లమెంటులో వ్యతిరేకించామని కేసీఆర్ తెలిపారు.ప్రజలందరూ బంద్‌ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలన్నారు.