నోరు అదుపులో పెట్టుకో అంబటి..!: ఎస్ వి బాబు

రసిక రత్న, అరగంట రాంబాబు హడావిడిగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్తో మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద సత్యదూత ఆరోపణలు చేశాడు. గతంలో నీలాగే పవన్ కళ్యాణ్ గారి మీద విషయం కక్కి, కక్కీ ఈ రోజు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రి నాని.. త్వరలో నీకు అదే గతి పడుతుందని పెడన నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షులు ఎస్ వి బాబు ఎద్దేవా చేశారు.

సోమవారం ప్రెస్ మీట్లో దీన్ని సినిమాలు తీయగలను అంటున్నాడు రాంబాబు. తీసుకో నిన్ను వద్దు అన్నది ఎవరు తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేసి నువ్వు సినిమాలు తీసుకో, సీరియల్ తీసుకో, సుకన్య తో వీధి నాటకాలు వేసుకో.. మాకు అభ్యంతరం లేదు. దమ్ము, ధైర్యం గురించీ మీరే చెప్పాలి నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చాక మరణించిన కౌలు రైతులు ఎంత మంది ఉన్నారు.. వారు వారి కుటుంబ సభ్యులకు మీరు చెల్లించిన పరిహారం ఎంత శ్వేత పత్రం రిలీజ్ చేయగలరా?..
మీ నాయకుడు నేను అధికారం వచ్చిన వారం రోజులలో సిపిఎస్ రద్దు చేస్తానని మాటిచ్చాడు చేశాడా రాంబాబు?

సిగ్గులేని మాటలు కట్టి పెట్టు మీ నాయకుడు ఏమైనా స్వతంత్ర పోరాటం చేసి 16 నెలల జైలు కి వెళ్లాడా?.. రాష్ట్ర ప్రజల కోసం పోరాటాలు చేసి జైలుకి వెళ్ళాడా? చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది చీకటి గుడిసెలు ఎవ్వరికి తెలియదు మీ బాగోతం.
గతంలో ఇప్పుడు నువ్వు వెలగబెడుతున్న శాఖలోనే మంత్రిగా చేసిన బెట్టింగ్ రాజా.. “పర్సెంట్.. అర పర్సెంట్ ఆ తొందర ఎందుకన్నా” అన్నాడు ఏమి పీకలేక పోయాడు. చివరికి తన మంత్రి పదవి పీకేస్తేతే నెల్లూరు జిల్లాలో ఫ్లెక్సీలు కట్టుకున్నాడు. త్వరలో తమ పరిస్థితి కూడా అదే.

తమరు మంత్రి పదవులు ఉండేది రెండు సంవత్సరాలు ఖచ్చితంగా లెక్క పెడితే సంవత్సరం కూడా లేదు. నీకు అరగంట, గంటా అయినా సరిపోద్ది అది వేరే విషయం.

ఉన్న ఈ కొద్ది సమయాన్ని శాఖాపరంగా మీ బాధ్యతలను కచ్చితంగా నిర్వహించండి. సాధ్యమైనంత వరకు ప్రజలకు మేలు చెయ్యండి. లేకపోతే ఏదో సినిమాలో అన్నట్టు ఏమిరా బాలరాజు నీ వల్ల దేశానికి ఉపయోగం అన్నట్టు ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అనవలసిన అవసరం వస్తుంది.

చివరిగా ఒక్క మాట గుర్తుపెట్టుకో రాంబాబు.. మంత్రివర్గ విస్తరణకు ముందుగానీ.. తర్వాత గానీ గతానికి భిన్నంగా ఏమీ జరగడం లేదు. మీలాంటి అల్పుల అరుపులను చూస్తుంటే గజరాజుల చూసి ఊర కుక్కలు మొరుగుతున్నట్లు అనిపిస్తుంది మా జన సైనికులకు.

వైసిపి మంత్రులారా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పవన్ కళ్యాణ్ గారి మీద అసత్య ఆరోపణలు మానుకోండి.
లేనియెడల రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారని పెడన నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షులు ఎస్ వి బాబు అంబటి రాంబాబుపై మండిపడ్డారు.