నోరు అదుపులో పెట్టుకో ఆంబోతు రాంబాబు: బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి నియోజకవర్గం: సర్వేపల్లిలోని మనుబోలులో గురువారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా
బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు మంత్రులని నియమించగా వారు మంత్రులుగా ఉండి ఏ శాఖలోనూ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయకపోగా, లేస్తే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం తప్ప ఇంకెందుకూ పనికిరాని విధంగా తయారయ్యార్రు. ఏదైతే అంబటి రాంబాబు ఇటీవల బ్రో సినిమాలో ఆయన పాత్ర ఎదో ఉంది అన్నట్టుగా అవాకులు చవాకులూ పేలుతున్నాడు. అయ్యా ఆంబోతు రాంబాబు నీకు అరగంట సంజన, సుకన్య అనే విధానంతో ఉన్నట్టున్నావు. నీకు రేపు 2024 ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్తారు. నాయనా ఇకనైనా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం మానేసి వరదల్లో ముంపుకు గురైన అన్నమయ్య ప్రాజెక్టు దిగువనున్న వాళ్లకి న్యాయం చేయండి. అదేవిధంగా వరదల సమయంలో సోమశిల జలాశయం కింద భాగంలో కాస్త డ్యామేజ్ అయింది. వాటిపైన మీ దృష్టి పెట్టండి. పోలవరం ప్రాజెక్టు గురించి ఢిల్లీకి వెళ్ళండి. అంతేగాని బ్రో సినిమా కోసం మీరు ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రజల సొమ్ముని మీ ఇష్టానుసారంగా మీరు వినియోగించుకోవడం కాదు. మీరు మీకు ఇచ్చిన నిటిపారుదల శాఖ మీద దృష్టి పెట్టండి. ఆంబోతు రాంబాబు గారు తర్వాత మీరు సినిమాలు తీద్దురు. ప్రజల సొమ్మని దోచుకుంటూ వాటిని సినిమాలు తీయాలి అనుకుంటున్నారు. మీ మీద కూడా ఎన్నో సినిమాలు తీయొచ్చు కానీ, అది చెస్తే నువ్వు తట్టుకోలేవు. పాపం ముసలిగా ఉన్నావు కాబట్టి నోరు అదుపులో పెట్టుకో ఆంబోతు రాంబాబు అని ఏద్దేవా చేసారు. ఈ కార్యక్రమంలో మనుబోలు మండల నాయకులు జాకీర్, సుధాకర్, శ్రీహరి, స్వామి తదితరులు పాల్గొన్నారు.