వైసిపి ఏపీ అభివృద్ధిని తిరోగమనం పట్టించింది

నెల్లూరు: ఏపీ అభివృద్ధిని సిఎం జగన్ మోహన్ రెడ్డి తిరోగమనం పట్టించారని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు విమర్శించారు. చిల్లకూరు మండలంలోని అన్నంబాక గ్రామంలో సోమవారం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాస్ట్రం అన్ని రంగాల్లో వెనుక పడిందని, జగన్ హయంలో అభివృద్ధి జరిగింది శూన్యమని, అవినీతి మాత్రం పెద్ద యెత్తున జరిగిందన్నారు. ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని జరగబోయే ఎన్నికల్లో వైసీపీని తరిమి కొట్టి ఎన్డీఏ కూటమి తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ రావుకు కమలం గుర్తుపై, ఎంఎల్ఏ అభ్యర్థి సునీల్ కుమార్ గారికి సైకిల్ గుర్తు పై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు అలకుంట సుబ్రమణ్యం, టీడీపీ నాయకులు పొనక వేణుగోపాల్ రెడ్డి, శేషయ్య జనసేన నాయకులు సోమిసెట్టి మనోజ్ కుమార్, సుమన్, మధు, బాలాజీ, సాయి తదితరులు పాల్గొన్నారు.