ఘనంగా వీర మహిళా నాయకురాలు కిట్లంగి పద్మ జన్మదిన వేడుకలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం,
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా:
యతైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలా:క్రీయా :
తల్లిగా.. గృహిణిగా ఆమె అందించే సేవలు అమూల్యమైనవి, వెల కట్టలేనివి, విశాఖజిల్లా పాడేరు జనసేన పార్టీ వీర మహిళా నాయకురాలు కిట్లంగి పద్మ 50వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి అలాగే జనసేన పార్టీలో పార్టీ బలోపేతానికి ప్రజల సమస్యల మీద గళం విప్పడానికి నాకు అవకాశాన్ని కలిపించిన జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలియజేసారు. పార్టీ నా పై పెట్టుకున్న నమ్మకాన్ని పార్టీ గ్రామ స్థాయి నుండి క్షేత్రస్థాయిలో నిస్వార్థంగా కృషి చేస్తానని తెలియజేసారు అలాగే 2024 లో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసే విధంగా అడుగులు వేయాలని దీశా నిర్దేశం చేశారు. అలాగే జనసేన పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న జనసైనికులకి జనసేన పార్టీ వీర మహిళలకు ధన్యవాదాలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ ఎక్సిక్యూటివ్ కమిటీ మెంబెర్ కొర్ర కమల్ హాసన్, పాడేరుమండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, ఆనంద్, రాజు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.