టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్

ఐపీఎల్ 2020 లో ఈ రోజు 5వ మ్యాచ్ కోల్‌కత నైట్ రైడర్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్‌కత కెప్టెన్ దినేష్ కార్తీక్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అలాగే రోహిత్ మాట్లాడుతూ… గతంలో ఏం జరిగిందన్నది వదిలేస్తే అప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు మేము చేయము అని తెలిపాడు. ఇక నైట్ రైడర్స్ కు మొదటి మ్యాచ్ ఇదే కాగా ముంబై మాత్రం తమ మొదటి మ్యాచ్ లో చెన్నై చేతిలో ఓడిపోయి ఈ రెండో మ్యాచ్ ను ఎలాగైనా గెలవాలని చూస్తుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది మరి కొద్ది గంటల్లో తెలుస్తోంది.