నో మై కాన్స్టిట్యుఎన్సీ 49వ రోజు

శ్రీకాళహస్తి, 49 వ రోజు నో మై కాన్స్టిట్యుఎన్సీ కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీ లోని తిరుపతి రావ్ వీధి, వివేకానంద వీధిలో పర్యటించి గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా డ్రైనేజ్ కాలువలు సక్రమంగా లేదని తెలిపారు, కాలువల పైకప్పు లేనందున చిన్నపాటి వర్షానికి కూడా వర్షపునీరు, డ్రైనేజీ నీరు వీధుల్లో నిల్వ ఉండి అనారోగ్యాలకు కారణమవుతున్నాయని తెలిపారు. మున్సిపల్ సిబ్బంది రోజు వారీ పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించడం లేదని తెలిపారు. కుక్కల బెడద ఎక్కువ ఉందని తెలిపారు. ఇంటిపన్ను, చెత్త పన్ను భారీగా పెంచారు తప్ప, మునిసిపల్ సిబ్బంది సేవలు ఏమాత్రం మెరుగు పరచలేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, నాయకులు రవి కుమార్ రెడ్డి నితీష్ కుమార్, జనసైనికులు ఉదయ్, భాను తదితరులు పాల్గొన్నారు.