ఆముదాలవలస నియోజకవర్గంలో జనంతో జనసేన 42వ రోజు

ఆముదాలవలస నియోజకవర్గం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు అడుగుజాడల్లో, ఆముదాలవలస నియోజకవర్గంలో నారాయణపురం గ్రామంలో జనంతో జనసేన 42వ రోజు కార్యక్రమంలో భాగముగా జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర (బూర్జ మండలం అధ్యక్షులు), కోరుకొండ మల్లేశ్వరావు , అంపిలి విక్రమ్(జేఎస్పీ ఎంపీటీసీ) మరియు కార్యకర్తలు ఆధ్వర్యంలో గడప గడప కి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొని మన జనసేన పార్టీ సిద్ధాంతాలును తెలియజేస్తూ, భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించి గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి జనసేన పార్టీని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరుపేరునా మనవి చేయడము జరిగింది. కార్యక్రమంలో ముఖ్యమైన సమస్య తుడ్డిలి గ్రామంలో ప్రధాన సమస్య నీటి కొళాయిలు లేకపోవడం, ఈ ప్రభుత్వం తుడ్డలి గ్రామానికి నీటి కొళాయిలు వీలైనంత తొందరగా వేపించి, తుడ్డిలి గ్రామానికి నీటి సమస్య లేకుండా చేయవలసిందిగా జనసేన పార్టీ తరపున మనవి చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో నాయుకులు రమేష్ సేపెనా, ప్రసాద్, మహేష్, రుద్ర, ప్రదీప్, మోహన్, కార్యకర్తలు మరియు తుడ్డలి గ్రామ ప్రజలు పల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేయడం జరిగినది.