నో మై కాన్స్టిట్యూఎన్సీ 53వ రోజు

శ్రీకాళహస్తి: నో మై కాన్స్టిట్యూఎన్సీ కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రాజెక్ట్ వీధి లోని కట్ట కింద వీధిలో పర్యటించి గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ప్రధానమైన సమస్యలు డ్రైనేజ్ కాలువలు రోజు వారీ క్లీనింగ్ చెయ్యడం లేదని నెలల కొద్ది మురికి నీరు కాలువలలో నిల్వ ఉంటూ అనారోగ్యానికి కారణం అవుతుందని తెలిపారు. కట్ట కింద వీధి దీపాలు లేకపోవడం వల్ల రాత్రి పూట ఇళ్ళకి వెళ్ళే వారికి తీవ్ర ఇబ్బంది అవుతుందని తెలిపారు. మునిసిపల్ సిబ్బంది రోజు వారి చెత్త ను తీసుకుని వెళ్ళడం లేదని తెలిపారు. కొంత మంది లబ్ది దారులకు జగనన్న ఇళ్ల స్థలాలు చూపారు కానీ, ఇంత వరకు పట్టాలు ఇవ్వలేదని వినుత దృష్టికి తెలిపారు. సమస్యలు మునిసిపల్ కమీషనర్, జిల్లా కలెక్టర్ గృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకి వినుత హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రమోద్, వెంకటరమణ యాదవ్, గిరీష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.