అధికారం కోసం కొట్టు ప్రజల్ని అంధకారంలోకి నెట్టేశాడు

  • కొట్టు సత్యనారాయణపై గాటు విమర్శలు చేసిన బొలిశెట్టి

తాడేపల్లిగూడెం: జనసేన పల్లెపోరు రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా పడాల గ్రామంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేపై బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అధికారం కోసం కొట్టు ప్రజల్ని అంధకారంలోకి నెట్టేశాడని అవినీతిలో వైసీపీ ప్రభుత్వం ముందుందని ఆరోపించారు. రైతాంగం తనను ఒక్కసారి విశ్వసించాలని మీ బతుకుల్లో వెలుగులు తెచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని బొలిశెట్టి తెలిపారు. తాను ప్రజల తరఫున బలంగా పోరాడాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, వైసీపీ ప్రభుత్వ తప్పులను ఎప్పటికప్పుడు పల్లెపోరులో ప్రజలకు అర్థమయ్యేలాగా తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, స్థానిక నాయకులు టి. ఉమేష్, స్వామి, ఆర్ బాలు, మ్ సాయి, సాయి కిరణ్, వై లక్ష్మీపతి, కే రాజు, కేసూర్య, కే శివ, కే జగన్ మోహన్, పులి అనిల్, గట్టి మేగారాజు కామిశెట్టి వాసు, పట్నాల మారుతి, అయినవల్లి సాయి, ఆయనవల్లి పట్టాభి, కోల్నాటి శివ మరియు జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.