పేర్ని నాని దిష్టిబొమ్మ దహనం చేసిన కోవూరు జనసేన

నెల్లూరు జిల్లా, కోవూరు, జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద పిచ్చికూతలు కూసిన పేర్ని నాని దిష్టి బొమ్మని ఊరేగించి దిష్టి బొమ్మ దహనం చేసిన కార్యక్రమం కోవూరు నియోజకవర్గం, కొడవలూరు మండలం, నార్త్ రాజుపాలెం సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ… మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అనవసర కారు కూతలు కూస్తే చూస్తూ ఊరుకోమని, ప్రజలలో జనసేనపార్టీకి, పవన్ కళ్యాణ్ కి ఆదరణ పెరగడం వలన కడుపు మంటతో నోటికొచ్చినట్టు మాట్లాడడం సభ్యత అనిపించుకోదు అని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో డా.దాడి అజయ్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు బద్దిపూడి సుదీర్, బుచ్చిమండల ప్రధాన కార్యదర్శి ఇబ్రహీమ్, బాలాజీ, సునీల్, వెంకటేశ్వర్లు మరియు జనసైనికులు పాల్గొన్నారు.