అగ్నిప్రమాద బాధితులకు అండగా కొవ్వలి ఫౌండేషన్

నరసాపురం, మొగల్తూరు మండలం, రామన్నపాలెం పంచాయతీ, లక్కువారితోటలో లక్కు వీరన్న, సత్యవేణి దంపతుల ఇల్లు కాలిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న కొవ్వలి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు నరసాపురం తెలుగుదేశం నాయకులు కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు అగ్నిప్రమాద కుటుంబాన్ని పరామర్శించి వారికి తక్షణ సహాయంగా నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేసి వారికి కొవ్వలి ఫౌండేషన్ ద్వారా ఇంటిని నిర్మించి ఇస్తమని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొవ్వలి ఫౌండేషన్ ట్రెజరర్ జయలక్ష్మి మరియు తెలుగుదేశం నాయకులు నంద్యాల బాబు, బళ్ళ శ్రీను, సంగబాబు తదితరులు పాల్గొనడం జరిగింది.