కొవ్వలి ఫౌండేషన్ మెగా జాబ్ మేళా

నరసాపురం: కొవ్వలి యతి రాజా రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో కొవ్వలి ఫౌండేషన్ ద్వారా నరసాపురం తెలగా కాపు కళ్యాణమండపంలో జరిగిన మెగా జాబ్ మేళాకు రాష్ట్రం నలుమూలల నుండి విశేషంగా 10 వేల మంది నిరుద్యోగ యువతీ, యువకులు హాజరయ్యారు. అందులో అర్హత గల సుమారు 2 వేల మంది నిరుద్యోగులకు వివిధ బహుళజాతి కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ముందుగా కొవ్వలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మెగా జాబ్ మేళాను డాక్టర్ చినమిల్లి సత్యనారాయణరావు, పొత్తూరి రామాంజనేయరాజు, కోటిపల్లి వెంకటేశ్వరరావులు ప్రారంభించి నిరుద్యోగ యువతకు వివిధ బహుళజాతి కంపెనీల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు సేవలను అభినందించారు.