జనసైనికుల నమ్మకాన్ని నిజం చేసి దేశానికి స్వర్ణ పతకం సాధించిన కృపారావు

మైలవరం: ఇటీవల న్యూజిలాండ్ లో జరిగిన అంతర్జాతీయ కామన్ వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలో భారతీయులంతా ముఖ్యంగా తెలుగువారు తలెత్తుకునే స్థాయిలో భారత్ కి గోల్డ్ మెడల్ సాధించిన యువ క్రీడాకారుడు కృపారావుకు తెలుగువారు. ఈ సందర్భంగా కృపారావుకు జనసైనికులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు.. అంతర్జాతీయ కామన్వెల్త్ క్రీడలకు ఎంపికైనప్పటికీ ఆర్థికంగా ఎలాంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి లభించకపోవడం వల్ల మైలవరం జనసైనికులు తమ వంతు బాధ్యతగా తోచినంత ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా న్యూజిలాండ్ వెళ్ళటానికి కారణమైన ప్రతి ఒక్క జనసైనికుడికి కృపారావు ధన్యవాదాలు తెలియజేశారు.