టీం పిడికిలి గోడప్రతులను ఆవిష్కరించిన కృష్ణా జిల్లా జనసేన నాయకులు

కృష్ణా జిల్లా, పామర్రు నియోజకవర్గం, స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు… ఎన్.ఆర్.ఐ జనసైనికులు రాజా మైలవరపు ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల పరిధిలో టీం పిడికిలి పేరిట వితరణ చేసిన గోడ ప్రతులు మరియు వాహన స్టికర్లు, అధ్యక్షుల వారి కృష్ణా జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు పచ్చిగళ్ళ సుధీర్ బాబు ఆధ్వర్యంలో, పామర్రు నియోజకవర్గం ఇంచార్జి తాడిశెట్టి నరేష్ మరియు రాపర్ల ఎంపీటీసీ కూనపరెడ్డి సుబ్బారావు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమం లో ఎర్రంశెట్టి వీరాస్వామి మరియు జనసైనికులు పాల్గొన్నారు.