కుందుర్తి గంగరాజు కుటుంబానికి జనసేన చేయూత

గోపాలపురం నియోజకవర్గం, దేవరపల్లి మండలం, సంగాయిగూడెం గ్రామంలో కొద్ది రోజుల క్రిందట హార్ట్ ఎటాక్ తో చనిపోయిన జనసైనికుడు కుందుర్తి గంగరాజు కుటుంబ సభ్యులకు నియోజకవర్గ నాయకులు దొడ్డికర్ల సువర్ణ రాజు ఆధ్వర్యంలో గ్రామ జనసైనికుల సహకారంతో 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవరపల్లి మండల అధ్యక్షులు కాట్నం గణేష్, చప్పటి శివ, మాలే సతీష్, రమణ, రాజు, పోలుమాటి నాని, సంగాయిగూడెం జనసేన పార్టీ గ్రామ నాయకులు ఆరేటి రత్నం, రవి, సోమిశెట్టి శ్రీను మరియు జనసైనికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.