ముస్లిం సోదరులకు జనసేన అండగా ఉంటుంది: పెనుమాల జానుబాబు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి గన్నవరం మండలం పోతవరం గ్రామంలో రంజాన్ సందర్భంగా ఎన్నారై జనసేన పార్టీ నాయకులు పెనుమాల జానుబాబు అండదండలతో గన్నవరం నియోజకవర్గం జనసైనికులు ముస్లిం సోదరులకు తోఫా కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గన్నవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు సాధనాల వీర వెంకట శ్రీనివాస్ జెడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సాధనాల వీర వెంకట శ్రీనివాస్ జెడి మాట్లాడుతూ ముస్లిం సోదరులకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఈ గన్నవరం నియోజకవర్గంలో ఎన్నారై జానుబాబు చేశారని అన్నారు. అలాగే టీవీ రమణ మాట్లాడుతూ ఈ గన్నవరం నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎన్నారై జానుబాబు ముందుంటున్నారని అలాగే ఎవరు కష్టాల్లో ఉన్నా కూడా జనసేన పార్టీ నుంచి జానుబాబు తను వంతు సాయం చేస్తున్నారని జనసేన పార్టీ నుంచి జానుబాబు కు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు జనసేన పార్టీలో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గణిశెట్టి శ్రీనివాస్, తోట శీను, బండి మణికంఠ, బొరుసు నాని, ఎర్రంశెట్టి ఆదినారాయణ, దుర్గాప్రసాద్, సురేష్, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.