కుప్పం జనసేన పల్లెబాట

కుప్పం నియోజకవర్గం, జిల్లాధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఆదివారం చేపట్టిన జనసేన పార్టీ పల్లెబాట కార్యక్రమం శాంతిపురం మండలం బెండనకుప్పం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి రామమూర్తి, సంయుక్త కార్యదర్శులు వేణు, మునెప్ప, రాష్ట్ర మత్స్యకార కార్యవర్గ సభ్యులు వామనమూర్తి, నియోజకవర్గ ఐ.టి. కోఆర్డినేటర్ మధు, మండల అధ్యక్షులు కిషోర్, హరీష్, అమీర్, మండల కమిటీ సభ్యులు భాస్కర్, రవితేజ, కెవి ప్రసాద్, హంసగిరి జాన్, మణి, అనీల్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.