ఘనంగా విజన్ గ్రూప్ సంస్థ 27వ వార్షికోత్సవం

సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు తన తొలి అడుగు 1997లో విజన్స్ గ్రూప్ సంస్థని ఏర్పాటు చేయడం జరిగినది. ఆ సంస్థ తన కృషితో తన ఆలోచనలతో అంచెలంచలుగా అభివృద్ధి పదంలో నడిపి ఈరోజు ఎంతో గొప్ప స్థాయికి తీసుకు వెళ్ళటం జరిగినది. ఈ సంస్థ ఆదివారం 07-05-2023 నాటికి 27 వసంతాలు పూర్తి చేసుకోవడం జరిగింది. హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బొర్రా వెంకట అప్పారావు ఆహ్వానం మేరకు ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు శంకర్ గౌడ్, అలాగే పవన్ కళ్యాణ్ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ కళ్యాణం శ్రీనివాసరావు(కెకె), చిలకలూరిపేట నుండి బాలాజీ, హాజరవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ గౌడ్ పూజా కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. అనంతరం నాయకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించి అలాగే మండల అధ్యక్షులు కౌన్సిలర్ మండల కమిటీ సభ్యులందరికీ కూడా బొర్రా వెంకట అప్పారావు చేతుల మీదుగా సన్మానించడం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన విందులో నాయకులు అందరూ జనసైనికులు కలిసి విందు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇంచార్జి సతీష్, పఠాన్ చెరువు ఇంచార్జి రాజేష్ యడమ, తెలంగాణా నాయకులు, నాలుగు మండలాల అధ్యక్షులు, కౌన్సిలర్, వైస్ ప్రెసిడెంట్, మండల కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.