పేద రైతుల నుండి తీసుకున్న స్థలాలను తిరిగి వారికి ఇవ్వాలి.. పాశం డిమాండ్

  • బలివె గ్రామంలో జగనన్న కాలనీల పేరిట పేద రైతుల నుండి తీసుకున్న స్థలాలను వెంటనే వారికి తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసిన నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం

ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ముసునూరు మండలం, బలివే గ్రామంలో రైతుల వద్ద జగనన్న కాలనీల పేరిట స్థలాలను తీసుకొని వారికి ఇంత వరకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా ఆఫీసుల చుట్టూ తిప్పుతూ ఇబ్బందుల పెడుతున్న నూజివీడు ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పుకుంటూ స్థానిక అధికారుల అండతో అక్రమంగా స్థలాలను తీసుకొని వారికి రెండేళ్ల నుండి ఇంత వరకు న్యాయం చేయకపోవడంతో నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు వారి సమస్యను సోమవారం జిల్లా కలెక్టరేట్ స్పందనలో అర్జీ పెట్టి జిల్లా రెవెన్యూ అధికారులను, బాధితులను కలిసి వివరించడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఎమ్మార్వోతో మాట్లాడి సమస్య పరిష్కరానికి వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బాధితులతో పాటు మండల జనసేన వైస్ ప్రెసిడెంట్ బోట్ల నాగేంద్ర ప్రసాద్, మండల జనసేన నాయకులు చేబత్తిన విజయ్, కుమ్మకూరి సురేష్ లక్ష్మణ్, రాజారావు, గోపి గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.