జనసేన పార్టీలో చేరిన లంకెల విశ్వేశ్వరరావు

  • పాడేరు జనసేన పార్టీలో కీలక మార్పులు జరగనున్నాయా!!

పాడేరు: కొణతాల రామకృష్ణ మాజీ మంత్రివర్యులు ముఖ్య అనుచరుడు లంకెల విశ్వేశ్వరరావు జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ చేతులమీదుగా విశాఖపట్నం కొణతాల రామకృష్ణ నివాసంలో కండువావేసి పార్టీలోకి అహ్వానించడం జరిగింది. భవిష్యత్తులో పాడేరు నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు పార్టీలోకి భారీగా క్షేత్రస్థాయిలో చేరనున్నట్టు లంకెల విశ్వేశ్వర రావు మీడియా మిత్రులకు తెలిపారు. తనవంతు పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని అలాగే రానున్న 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరైనను తనదైన రీతిలో గెలుపుకు కృషి చేస్తామని తెలియజేశారు.