కూకట్‌పల్లి జనసేన ఆధ్వర్యంలో ఛలో మచిలీపట్నం పోస్టర్ ఆవిష్కరణ

కూకట్‌పల్లి: జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు కూకట్పల్లి నియోజకవర్గం కోఆర్డినేటర్ నాగేంద్ర ఆధ్వర్యంలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఛలో మచిలీపట్నం కార్యక్రమానికి సంబంధించి వాల్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి నియోజకవర్గ డివిజన్ ప్రెసిడెంట్లు కొల్లా శంకర్, వెంకటేశ్వర్లు, నాగరాజు, మహేష్, రాజు, వేణుగోపాల్, వీరు, ప్రసాద్ మరి జన సైనికులు పాల్గొనడం జరిగింది.