Anantapuram: రైతులకు భరోసా ఇచ్చిన లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి విస్తృత పర్యటన చేసి ఇటీవల కురిసిన అకాల వర్షాలతో అనంతపురం జిల్లాలో దెబ్బతిన్న ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, వేరుశనగ, కంది, ఆముదం, ఉలవ, టమోటా, వంకాయ, మిరప, అరటి, మరియు పూల తోటలను పరిశీలించి… నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చి మీ సమస్యలన్నింటినీ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాను, వీలైనంత తొందరలో ప్రభుత్వం నుంచి మీకు నష్టపరిహారం ఇప్పిస్తానని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, జనసేన నాయకుల ంవ్.శ్రీనివాస్, కె. విశ్వనాధ్ జనసేన, సంతోష, ఆకుల అశోక్, వినయ్ కుమార్, దండు హరిరాయల్, రాజు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.