కిడ్ని సమస్యతో బాధపడుతున్న జనసైనికునికి అండగా నాయకులు

సిద్దిపేట జిల్లా, నంగునూరు మండలం, సిద్ధన్న పేట గ్రామం ఖానాపూరంలో సాయికుమార్ అనే జనసైనికుడు కిడ్నిలకు సంబందించిన సమస్యతో గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హాస్పిటల్ కి చూపించుకోగా ట్రీట్మెంట్ మరియు సర్జరీ అవసరమని వైద్యులు చెప్పడం జరిగింది. ఆర్థిక ఇబ్బందుల వలన ట్రీట్మెంట్ మధ్యలోనే ఆపడంతో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ మరియు

1)ఉమ్మడి వరంగల్ జిల్లా యువజన విభాగ కమిటీ సభ్యులు
2)ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగం కమిటీ సభ్యులు
3)ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం కమిటీ సభ్యులు
4)ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యువజన విభాగం కమిటీ సభ్యులు

కలిసి 30,000 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జనసైనికుడు సాయికి అందజేయడం జరిగింది.

ఈ యొక్క కార్యక్రమంలో యువజన విభాగం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆలేటి నరేందర్ గౌడ్ , యువజన విభాగం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనరల్ సెక్రెటరీ శ్రీ. శివరెడ్డి చల్లా, ఉపాధ్యక్షులు తడికపెల్లి అరవింద్, ఎగ్జక్యూటివ్ మెంబర్ పండు గగన్ కుమార్, యువజన విభాగం ఉమ్మడి వరంగల్ జిల్లా జనరల్ సెక్రెటరీ చింత రమేష్ ,ఉపాధ్యక్షులు వద్ది వీరా రెడ్డి , సిద్దం రవి , ఆర్గనైజింగ్ సెక్రటరీ కే అన్వేష్ , ఎగ్జక్యూటివ్ మెంబర్ బి.నవీన్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.