నూతన స్కూల్ బిల్డింగ్ కోసం వేమూరు జనసేన నిరసన

వేమూరు నియోజకవర్గం, చుండూరు మండలం మండూరు గ్రామం లోని ఎంపీపీ ఎలిమెంటరీ పాఠశాల భవనం స్లాబ్ పెచ్చులు ఊడి విద్యార్థులు కి ప్రమాదకరంగా ఉండటంతో జనసేన చుండూరు మండలం అధ్యక్షులు శ్రీరామమూర్తి, జిల్లా కార్యదర్శులు బోడియ్య, అనురాధ, చుండూరు మండలం ఉపాధ్యక్షులు దేవిరెడ్డి మహేష్, జగదీష్, బత్తుల అనిల్, మనీష్, సాయి బాలాజీ, అనిల్, శ్రీను, మరియు జనసైనికులు సందర్శించి పాఠశాల నూతన భవనం నిర్మించాలని మండలం విద్యాధికారి రవికాంత్ ని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు జనసేన పోరాటం చేస్తుందని నాయకులు తెలియజేసారు.