జనసేనాని త్వరగా కోలుకోవాలని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి పూజలు నిర్వహించిన జనసేన నాయకులు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ కళ్యాణం శ్రీనివాస్ (కెకె) మరియు కొంత మంది వ్యక్తిగత సిబ్బంది విష జ్వరానికి గురయ్యారు.. అందరూ తొందరగా కోలుకోవాలని అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన ప్రోగ్రాం కమిటీ మెంబర్ ముచ్చర్ల వెంకటేష్, చిరంజీవి యువత విజయవాడ సెక్రెటరీ గుండుబోగుల నాగు నాయుడు, అంతర్వేది పల్లవపాలెం గ్రామ శాఖ అధ్యక్షులు ఇల్లింగి దుర్గ ప్రసాద్, అడ్డగళ్ల నాగవెంకట బంగార్రాజు, గుండుబొగుల సాయి నరసింహ, మారెళ్ళ కిషోర్ మరియు జన సైనికులు పాల్గొన్నారు.