గౌతమ్ రెడ్డి మృతి పట్ల వేగుళ్ళ లీలాకృష్ణ సంతాపం

మండపేట, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి మృతి పట్ల మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ గారు సంతాపాన్ని ప్రకటించారు. తనకు గౌతమ్ రెడ్డికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఇటీవల హైదరాబాదులో ఆయన్ని కలుసుకున్నానని ఇంతలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుందన్నారు. రాష్ట్ర ఐటి అభివృద్ధికి ఆయన ఎనలేని సేవ చేసారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనో నిబ్బరాన్ని ప్రసాదించాలని కోరుతూ… జనసేన తరుపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.