ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసిన గంధం వెంకట్రావు

గాజువాక నియోజకవర్గం: ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు విశాఖపట్నం జిల్లా కార్మిక నాయకులు మరియు జనసేన పార్టీ నాయకులు గంధం వెంకట్రావు ఆర్థిక సహాయం అందించారు. 65వ వార్డు బానోజీ తోటకు చెందిన ఎస్ ఈశ్వరరావు ఇటీవల చేయి నరాలకు ఆపరేషన్ చేయించుకున్న ఈశ్వరరావు వారి కుటుంబానికి 5000 రూపాయలు మరియు వాంబే కాలనీలో ఉంటున్న తాపీ పని చేస్తూ ప్రమాదవశాత్తు పరంజ మీద నుండి పడిపోయి మరణించిన దాకరపు ఆసిరి నాయుడు కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న గంధం వెంకట్రావుకి 65వ వార్డు జనసేన పార్టీ నుండి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. చనిపోయిన తాపీ మేస్త్రి అసిర్నాయుడికి ఇద్దరు ఆడపిల్లలు వారి చదువుకి కాలేజీ ఫీజు నిమిత్తం దాతలు ఎవరైనా ఉంటే ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పవనిజం సాడే రామారావు, పలపాల కనికేశ్వరరావు, బత్తిన శంకర్, జగదీష్ కెల్లా, జి హరిబాబు, కె జనార్ధన్, ఎం సత్తిబాబు, తిలక్, సంతోష్ పాల్గొన్నారు.