జనసేన తరపున ఓటు విలువ-ఓటరు చైతన్యం

‘ఓటు విలువ-ఓటరు చైతన్యం’ కార్యక్రమంలో భాగంగా జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేవిధంగా ఓటర్లచే ప్రమాణం చేయించారు. ఓటర్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, దేశ సార్వభౌమా ధికారాన్ని, సమగ్రతను కాపాడడానికి, ఒక ఓటరుగా, నా కర్తవ్యమైన “ఓటు”ను శ్రద్దతో, అంతఃకరణ శుద్దితో, భయంగాని, పక్షపాతంగాని, రాగద్వేషాలు గాని లేకుండా, నోటుకు, మద్యానికి, కులానికి, మతానికి, సంక్షేమ పథకాల ఎరకు కూడా లొంగకుండా వివేచనా, విచక్షణా జ్ఞానంతో రాజ్యాంగం నాకు కల్పించిన అత్యద్భుతమైన అవకాశం అయినటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటానని మన భారత రాజ్యాంగం మీద త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నానని ఓటర్లచే ప్రమాణం చేయించారు. అదేవిధంగా మనందరం ఈ అద్భుత సందేశంతో ఓటరు చైతన్యానికి కృషి చేద్దాం అని చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు.