రాష్ట్ర శ్రేయస్సు, ప్రజల శ్రేయస్సు కోసం జగన్ ప్రభుత్వాన్ని సమిష్టిగా తరిమేద్దాం

  • జనసేన – టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో ఇమ్మడి, కందుల

మార్కాపురం, రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తూ ప్రజలను వేదించుకుతింటున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే లక్ష్యంగా ఇరుపార్టీల నాయకులు సమన్వయంతో కలిసి పోరాడాలని జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మరియు టిడిపి మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ కందుల నారాయణరెడ్డి జనసేన-టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం మార్కాపురం పట్టణంలోనీ సౌజన్య ఫంక్షన్ హాల్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఇరు పార్టీల ఇంచార్జ్ లు మాట్లాడుతూ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వెనుకబడిన మార్కాపురం ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించడమే కాకుండా త్వరితగతిన వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీరు ఇస్తామని అన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజలు ఏవైతే కోల్పోయారో వాటిని తిరిగి ప్రజలకే ఇప్పించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు ఎవరు కూడా భయపడనవసరం లేదని మీ వెంట జనసేన, టిడిపి నాయకులు ఉంటారని ఆ విధంగా ప్రజలకు ధైర్యం కల్పించి పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా సమన్వయంతో ముందుకు సాగుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం జనసేన ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ ఒకప్పుడు నేను కూడా టిడిపి నాయకుడినేనని మా మధ్య ఎటువంటి బేదాభిప్రాయాలు లేవని అన్నదమ్ముల్లాగా కలసి ముందుకు సాగుతామని ఎవరు ఎటువంటి అపోహాలు పడవలసిన అవసరం లేదని అన్నారు. రాష్ట్రం అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి అన్నీ వర్గాలను వేదించటమే పనిగా పెట్టుకున్నారని, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం జనసేన, టీడీపీ అధినేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సమిష్టి పోరాటానికి సిద్ధమయ్యారని, వారి ఆదేశాల మేరకు మార్కాపురం నియోజకవర్గంలో కూడా కలిసికట్టుగా కృషి చేసి,రాష్ట్రంలో వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రతీ ఒక్కరూ సిద్ధంగా ఉండాలని ప్రతీ గ్రామంలో సమన్వయంతో పని చేసి రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో జనసేన, టిడిపి సైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన మరియు టిడిపి కార్యకర్తలు, అభిమానులు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.