కూకట్పల్లిలో ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ప్రచారం

తెలంగాణ, కూకట్పల్లి నియోజకవర్గం, బాలానగర్ డివిజన్, కుమ్మర బస్తీ, హనుమాన్ టెంపుల్ దగ్గర నుండి బుధవారం బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. బాలానగర్ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమాన్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కార్యకర్తల నడుమ పాదయాత్రను ప్రారంభించి గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్. బుధవారం ఉదయం బాలానగర్ హనుమాన్ కామన్ నుండి బిజెపి శ్రేణులు, జనసైనికులు కలిసి పాదయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మందులోల బస్తీ, కుమ్మర బస్తి, సిక్కుల బస్తీ, దాసరి బస్తి, బాలానగర్ విలేజ్, రాజు కాలనీ, వినాయక నగర్, సాయి నగర్, కళ్యాణి నగర్, నవజీవన్ నగర్, ఫిరోజ్ గూడ వరకు పాదయాత్ర కొనసాగింది. ఆయన మాట్లాడుతూ బాలానగర్ డివిజన్ గడిచిన 10 సంవత్సరాల నుంచి అభివృద్ధికి దూరంగా ఉందని, ఇక్కడ ప్రజలు ఎక్కువగా పేదవారు నివసిస్తారని చిన్న చిన్న కంపెనీలలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. వారి ప్రధానమైన సమస్యలు నీటి సమస్య, వాటర్ సమస్య, డ్రైనేజీ సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రధానంగా ఇళ్ల సమస్య, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి, మోసం చేసింది ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఏ మొఖం పెట్టుకుని మీ దగ్గరికి వచ్చి ఓటు అడుగుతారని అంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈసారి ఆ తప్పు జరగకుండా బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను. ఈసారి జనసేన, బిజెపిను బలపరచవలసిందిగా అలాగే మన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుపై ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమంలో మాధవరం కాంతారావు, ఎ.సూర్య రావు, శంకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు రమేష్, రాజేష్, నాగరాజు, సునీల్, రమేష్, శివరంజని, వాణి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, డివిజన్ నాయకులు, మహిళా నాయకులు, జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జనసేనలోకి జబర్దస్త్ అప్పారావు

తెలంగాణ, కూకట్పల్లి, బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ సతీమణి ముమ్మారెడ్డి విజయలక్ష్మి ఆధ్వర్యంలో జబర్దస్త్ అప్పారావు బుధవారం జనసేన పార్టీ కండువా తీసుకున్నారు. ఈ సందర్భంగా జబర్దస్త్ అప్పారావు మాట్లాడుతూ తాను జనసేన పార్టీకి అభిమాని అని, ఓటు వేసి ఆ అభిమానాన్ని చూపుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

  • 115 – బాలాజీ నగర్ డివిజన్లో పాదయాత్ర

తెలంగాణ, కూకట్పల్లి నియోజకవర్గం 115 – బాలాజీ నగర్ డివిజన్లో పాదయాత్రలో భాగంగా బుధవారం కేపీహెచ్బీ కాలనీలో జనసేన మరియు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయిన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించమని డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

  • రాజన్న కమలదలం సభ్యుల ఆధ్వర్యంలో జనసేన ప్రచారం

తెలంగాణ, కూకట్పల్లి నియోజకవర్గం, రాజన్న కమలదలం సభ్యులు జక్కుల వినయ్ కుమార్, వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రిలయన్స్ స్మార్ట్ నుంచి వెంకట్రావు నగర్ కాలనీ రోడ్డు వెంకయ్య పార్క్ లో మరియు వెంకట్రావు కాలనీలో గాజు గ్లాసు గుర్తుకు ఓటేయమని ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నాగరాజు, జంగంపల్లి సాయి తదితరులు పాల్గొన్నారు.

  • ఫతేనగర్ డివిజన్ 118 లో జనసేన ప్రచారం

తెలంగాణ, కూకట్పల్లి నియోజకవర్గం, కూకట్పల్లి నియోజకవర్గంలో ఫతేనగర్ డివిజన్ 118లో జనసేన పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ బలపరచిన జనసేనపార్టీ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించమని ఫతేనగర్ డివిజన్ లో ప్రతి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ నాయకులు ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.