అల్లాడు పాలెం సమస్యపై పోరాడతాం: శ్రీమతి లోకం మాధవి

నెల్లిమర్ల: కందివలస గెడ్డని అనుకొని వున్న కెమికల్ కంపెనీలు గ్రీన్ టేక్, శేషాసాయి, మరియు ఆంధ్రఆర్గానిక్, గెడ్డలోకి ఎఫెలెంట్రీట్మెంట్ చెయ్యకుండా విషపూరితమైన కెమికల్ వాటర్ పైడిభీమవరం డ్రైనేజీ కాలువ ద్వారా బ్రిడ్జిఏరియాలొ గెడ్డలోకి విడుదల చేస్తున్నారు. సదరు పరిశ్రమ యాజమాన్యం వారికి గ్రామస్తులు పశువులు మారియు చేపలు చనిపోతున్నాయని, అలాగే పశువులు గర్భస్రావతో నష్ట పోతున్నారు. పశువులు డాక్టర్ కి చూపిస్తే వాటర్ ప్రాబ్లెమ్ అనీ చెప్పు చున్నారు. అందరూ ఎన్నిసార్లు ంపొరపెట్టుకున్నా వరుమాత్రం ఎదqఅవిధిగా గెడ్డల్లోకి కెమికల్ వాటర్ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే గెడ్డని అక్రమంగా రోడ్డువేసి కొన్ని కెమికల్ కంపెనీలా పైపులైన్ కప్పివేసి ఆ పైప్ లైన్స్ కుడా డెమేజ్ అయి గ్రౌండ్ వాటర్ 12 కిలోమీటర్లు మేర కలుషితం అయి ప్రజలు అనారోగ్యానికి గురై కీళ్ళ నొప్పులు, కిడ్నీ మరియు చర్మవ్యాధులు వచ్చి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీ మరియు ప్రభుత్వం ఎవరు మా గ్రామాలను పట్టించు కోవడం లేదు. ఇంత కాలుష్యం భరిస్తూన్నా, అల్లాడిపాలెం గ్రామలికి ఉపాధి అవకాశం కూడా చాలా మందికి లేదు. అరబిందో మరియు శ్రేయాస్ పరిశ్రమలు హైకోర్టు నోటీస్ వున్నా అక్రమ నిర్మాణరోడ్డు వాడుకొని కోర్ట్ ఆర్డర్ దిక్కరిస్తూ వారిపనులు వారు యధావిదిగా చేస్తున్నారు. ఈ విషయం తెలుకొని జనసేన పార్టీ నే్లిమర్ల నియోజకవర్గం శ్రీమతి లోకం మాధవి స్పందించి, అల్లాడు పాలెం గ్రామానికి విచ్చేసి సమస్య పరిస్కారం అయ్యే వరకు పోరాడతాం అని గ్రామ ప్రజలకు చెప్పారు.. అలాగే గ్రామానికి విచ్చేసిన మేడం గారికి గ్రామంలో జనావాసాల మధ్యలో పెట్టిన వైన్ షాప్ కొరకు మహిళలు అందరూ మొరపెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా పెట్టడం వలన మాకు చాలా సమస్యలు కలుగుతున్నాయని గ్రామ ప్రజలు తెలియజేసారు. దీనిపై శ్రీమతి లోకం మాధవి స్పందించి కలెక్టర్ కి తెలిపి షాపు తొలగించ్చేవరకు గ్రామస్తులకి అండగా ఉంటామని తెలియజేసారు.