సీతానగరంలో పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల

  • సీతానగరం మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: సీతానగరం మండలం మునుకొడవలి గ్రామానికి చెందిన కవల సురేష్ అనారోగ్యంతో బాధపడతున్న విషయం తెలుసుకుని వారిని శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. సీతానగరం మండలం రాజంపేట గ్రామానికి చెందిన దూల దుర్గాప్రసాద్ ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి మనోధైర్యం చెప్పారు. అనంతరం సీతానగరం మండలం, రాపాక గ్రామానికి చెందిన సబ్బతి వెంకటేష్ బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడతున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు. వీరి వెంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కోరుకొండ మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.