జనసేనకు విజయాన్ని అందిద్దాం.. ఆమంచి స్వాములు

కొండేపి నియోజకవర్గం: కె. బిట్రగుంటలో జనసైనికులతో ఆత్మీయ సమావేశం, మరియు సింగరాయకొండలో జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవనికి జనసేన నాయకులు ఆమంచి స్వాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అందరము కలిసిమెలిసి జనసేన పార్టీని రాబోయే ఎన్నికలలో టిడిపి, వైసిపి కంటే ప్రకాశం జిల్లాలో జనసేనకు మంచి విజయాన్ని అందిద్దామని, మీరందరూ ఒక మాట మీద నిలబడాలని, మీకు ఏ సహకారం కావాలన్నా నా వంతుగా మీకు చేతనైన సహాయం అందిస్తానని, ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఒంగోలు కార్పొరేటర్ మలగా రమేష్, లీగల్ సెల్ సభ్యులు వరికూటి నాగరాజు, జిల్లా జాయింట్ సెక్రెటరీ ఎన్ వి సురేష్ బాబు మరియు జనసైనికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆమంచి స్వాములు నెల్లూరు జిల్లా జనసైనికుల ఆత్మీయ సమావేశానికి వెళ్లారు.