అదాని పోర్ట్ కార్మికులకు ఆర్థిక సహాయం అందించిన దల్లి గోవింద రెడ్డి

గాజువాక నియోజకవర్గం: గంగవరం పోర్ట్ యాజమాన్యం అదాని గ్రూపు వారి వైఖరిని నిరసిస్తూ గంగవరం పోర్టు నిర్వాసిత ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేస్తూ తమకు దక్కవలసిన న్యాయ డిమాండ్లను పరిష్కారం చేయాలని ఆదివారము పెదగంట్యాడ గాంధీ విగ్రహం వద్ద 20వ రోజు నిరాహార దీక్ష చేపట్టారు. వాళ్లకు న్యాయపరమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వేతనాల సవరణలు చేపట్టాలని, అకారణంగా తొలగించిన ఉద్యోగుల్ని వెంటనే తిరిగి తీసుకోవాలని, 29 మంది ఉద్యోగులపై పెట్టిన షరతలను వెంటనే ఉపసహరించుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని తమ న్యాయమైన డిమాండ్లతో దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ 64వ వార్డ్ కార్పొరేటర్ దల్లి గోవింద రెడ్డి జనసేన పార్టీ తరఫున సంఘీభావం తెలియజేస్తూ 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. మీ పోరాటానికి ఎల్లప్పుడూ జనసేన పార్టీ మద్దతు ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ముగి శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది.