దోమల్ని తరిమికొడదాం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం – లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గంలో, గ్రామ గ్రామాన పర్యటిస్తున్న లోకం మాధవికి ఎంతో మంది ప్రజలు మోరపెట్టుకున్న సమస్య పారిశుధ్యం సరిగ్గా లేకపోవడం దీనివలన దోమలు ఎక్కువగా ప్రబలి చిన్న పిల్లలు మరియి పెద్దవారు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని మలేరియా డెంగ్యూ ఎక్కువగా ఉందని కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారని, చాలా మంది అధిక వ్యయంతో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని కచ్చితంగా మీరు ఈ విషయంపై స్పందించాలి అన్నపుడు వివిధ పంచాయతీ సెక్రటరీలతో మాట్లాడిన మాధవి, ఆమెకి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే పంచాయితీ రికార్డులలో అయితే దోమల మందు కొట్టినట్టు ఉంది కానీ అక్కడ కార్యచరణ అయితే జరగలేదు అని లోకం మాధవి తెలిపారు. ఏ ప్రాంతానికి వెళ్లిన ఇది ప్రధాన సమస్యగా గుర్తించి మా సొంత వ్యయంతో ప్రతి పంచాయతీలో ఈ దోమల మందు కొట్టించాలని నిర్ణయించుకున్నాం అని లోకం మాధవి తెలిపారు.