తాడేపల్లిగూడెం జనసేన, టిడిపి సభ విజయవంతం చేద్దాం!!

  • పోస్టర్ ను ఆవిష్కరించిన శెట్టిబత్తుల

కోనసీమ జిల్లా, అమలాపురం: ఫిబ్రవరి 28వ తేదీ బుధవారం తాడేపల్లిగూడెంలో జరుగు ఎన్నికల శంఖారావం సభ తెలుగు జన విజయకేతనం జెండా మీకోసం మీ వెంటే అనే నాదంతో వైసీపీ విముక్తా రాష్ట్రం కోసం వైసీపీ విముక్తా ఆంధ్ర రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్- చంద్రబాబు నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని, అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమలాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక శాతములో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో వెళ్లి విజయ సభను విజయవంతం చేయాలని రాజబాబు కోరారు. ఈ కార్యక్రమంలో చిక్కాల సతీష్, సుధా చిన్న, మహా దశ నాగేశ్వరరావు, చిక్కం భీముడు, సందడి శ్రీను, గండి మణికంఠ స్వామి, కడిమి చినబాబు, తాళ్ల రవి తదితరులు ఫాల్గొన్నారు.