జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం

అల్లూరి జిల్లా, పాడేరు మండలం, ఇరుడా పల్లి పంచాయతీ సరియపల్లి గ్రామంలో పాడేరు మండల జనసేన అధ్యక్షులు నందొలి మురళి కృష్ణ, ముదిలి సుబ్బారావు, రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రూరల్ జిల్లా జాయింట్ సెక్రెటరీ కిల్లో రాజన్, కిల్లో రాజన్ మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి ముందుకు రావాలని, గ్రామం తరపున యువత అండగా నిలబడాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం ఎలక్షన్ ముందు కాకమ్మ కథలు చెప్పి యువతను భారీగా మోసం చేసి నిటారుగా ముంచేసిందని అందుకే యువత అంతా కూడా జనసేన వైపు పట్టం కట్టి జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా ఆలోచిస్తున్నారని తెలియజేశారు. యువత మార్పు కోరి తలరాతలు మనల్ని మనమే మార్చుకునే దిశగా తెగించి పోరాడి ముందుకు కదలాలని మనకు అండగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని తెలియజేశారు. యువతకి ఉపాధి, అభివృద్ధి సజావుగా జరగాలంటే కచ్చితంగా జనసేన పార్టీ గెలవాల్సిందేనని బలంగా చెప్పారు. సిద్ధాంతాలను తెలుసుకున్న గ్రామయువత సైతం మీ వెంటే ఉంటామని జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. మండల అధ్యక్షులు మురళీకృష్ణ మాట్లాడుతూ.. మన గ్రామం తరపున మనమే పోరాటం చేసి జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం మన గ్రామాన్ని మన పంచాయతీని మన బ్రతుకులను మనమే సరి చేసుకుందాం అని తెలియజేశారు. రాక్షస పాలన అంతంచేయడమే లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రవి సతీష్ మోహన్ శివకుమార్, వీరన్న, నగేశ్ శ్రీను, మల్లేష్ తదితర సైనికులు పాల్గొన్నారు.